హైదరాబాద్ : కూకట్ పల్లి లో భారీ మోసం బైటపడింది. సుమారు 300 మంది పెట్టుబడిదారులకు రూ.5కోట్లు టోకరా వేసిన భారీ మోసం బైటపడింది. సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అనే ఓ కంపెనీ డబ్బు వసూలు చేసిన బోర్టు తిప్పేసింది. సదరు సంస్థ పెట్టుబడిదారులకు కరక్కాయలిచ్చి పొడి చేసి ఇస్తే రూ. 300 లాభం ఇస్తానని మభ్య పెట్టింది. కాగా కరక్కాయలను తమవద్దనే కొననాలని షరతు పెట్టింది. బాధితులకు కిలో కరక్కాయలను రూ.1000లకు విక్రయించింది. కాగా నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన మల్లికార్జునగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm