ఢాకా: ఐదుగురు విద్యార్థులు నదిలో ఈతకెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈశాన్య బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. కాక్స్ బజార్ జిల్లాలోని ఓ స్కూల్లో చెందిన 22 మంది విద్యార్థులు మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. అప్పటివరకు ఒక్క దగ్గరే ఉన్న విద్యార్థుల్లో ఐదుగురు మ్యాచ్ ముగిసిన తర్వాత మాతాముహురి నదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అలల తాకిడికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయని స్థానిక పోలీస్ ఉన్నతాధికారి భక్తియార్ ఉద్దిన్ చౌదరి తెలిపారు. వేలాది మంది ప్రజల మధ్య విద్యార్థుల అంత్యక్రియలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm