హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-జైపూర్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ (రైల్ నెంబర్: 02731) హైదరాబాద్ నుంచి ఆగస్టు 3, 10వ తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం 4.25గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్ (సాయంత్రం 4.55గంటలకు) స్టేషన్ మీదుగా ఆదివారం ఉదయం 6.25గంటలకు జైపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో..... జైపూర్-హైదరాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 02732) జైపూర్ నుంచి ఆగస్టు 5, 12వ తేదీల్లో (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు బయల్దేరి, మంగళవారం తెల్లవారుజాము ఒంటి గంటకు సికింద్రాబాద్ స్టేషన్కు, హైదరాబాద్కు 2గంటలకు చేరుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm