నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాల్టీలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయని, మున్సిపాల్టీలకు కమీషనర్లు, గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రతిపాదనలు రెండు రోజుల్లో పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో హరితహారం, మత్స్యశాఖ, పాడి, గేదెల పంపిణీ, వివిధ కేసులకు సంబంధించిన మెడికల్ పోస్టుమార్టమ్ నివేదికలు, లారీల సమ్మె తదితర అంశాలపై ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్చార్జీలుగా గ్రామపంచాయతీ సెక్రటరీలను, 68 నూతన మున్సిపాల్టీలకు మున్సిపల్ కమీషనర్లుగా తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లుగా ఆర్డీఓ లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించే ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm