అమరావతి: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్తో మాజీ మంత్రి శైలజానాథ్ బుధవారం భేటీ అయ్యారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలు, మెడికల్ ఇన్సూరెన్స్ సమస్యలపై స్పీకర్తో చర్చించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ నేతలను కలిస్తే తప్పేంటి అపని ఆయన ప్రశ్నించారు. భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. అంతకుముందు ఉదయం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన శైలజానాథ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై చర్చించినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm