ముంబై : స్టాక్ మార్కెట్ల బోణి అదిరింది. సెన్సెక్స్ ఏకంగా ప్రారంభంలోనే డబుల్ సెంచరీ సాధించింది. నిఫ్టీ సైతం 11,300 మార్కును పునరుద్ధరించేసుకుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, రూపాయి విలువ బలపడటంతో దలాల్ స్ట్రీట్ దుమ్మురేపింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంలో 37,321 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంలో 11,305 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ స్టాక్స్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm