హైదరాబాద్: ఈ నెల 23న జరిగే గణేశ్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర అడిషనల్ సీపీ అనిల్కుమార్ తెలిపారు. ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు బందోబస్తును పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. బందోబస్తు విధుల్లో 2100 పోలీసులు పాల్గొంటారని తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం 38 క్రేన్లు ఏర్పాటు చేశామని, ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం 10 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసిట్లు సీపీ వెల్లడించారు. నిమజ్జనం సమయంలో వాహనాలకు ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లో అనుమతి లేదన్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు అనుమతి లేదని తెలిపారు. ప్రైవేటు బస్సులకు ఈ నెల 23న తేదీ నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరకు అనుమతి లేదన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm