ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీకాల్ పిటిషన్ను తిరస్కరించడంతో... కోర్టుకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm