హైదరాబాద్ : దాదాపు పది సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు సమీపంలో నిరసనలు తెలిపిన చంద్రబాబుపై నమోదైన కేసులో, ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాబాద్ చేరుకున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కాలేదంటూ, చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనపై ఉన్న వారంట్ ను రీకాల్ చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో సిద్ధార్థ్ లూత్రా వారంట్ రీకాల్ కోసం వాదనలు వినిపించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm