శ్రీకాకుళం: తితలీ సృష్టించిన బీభత్సంతో జిల్లాలోని ఇచ్ఛాపురం, బిల్లమడ మండలాలు జలదిగ్భంలో ఉండిపోయాయి. బహుదా నది ప్రవాహంతో ఇళ్లు, రహదారులు నీటమునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు గొట్టా బ్యారేజ్, వంశధారకు వరద ముప్పు పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm