ముంబయి: ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో నిన్న భారీగా కుదేలైన మార్కెట్లు ఈరోజు తిరిగి లాభాల బాటపట్టాయి. ముడి చమురు ధరలు కొంత తగ్గడం, ఇతర అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ట్రేడింగ్ ఆరంభంలో 29 పైసలు బలపడింది. ఉదయం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 10,350పైన ట్రేడింగ్ ఆరంభించింది. 9.40 సమయానికి సెన్సెక్స్ 531 పాయింట్లు లాభపడి 34532 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 10408 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm