విశాఖపట్నం: తిత్లీ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎక్కువగా ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, భారత వాతావరణ విభాగం అధికారులు కూడా ప్రకటించడంతో తీవ్ర ఆందోళనకు గురైన నగరవాసులు ఎలాంటి వర్షాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిత్లీ ప్రభావంతో ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఉత్కంఠకు గురైన నగరవాసులకు ఉపశమనం లభించినట్లైంది.
Mon Jan 19, 2015 06:51 pm