మిర్యాలగూడ : అమృతప్రణయ్ న్యాయపోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న ప్రణయ్ సంస్మరణ సభ నిర్వహించేందుకు సిద్ధపడినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో ఈనెల 21న నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత పీడిత, బహుజన, కుల పో రాట, కుల నిర్మూలన సంఘాల ప్రతినిధులతోపాటు ప్రజాస్వామికవాదులు, మేథావులు అధిక సంఖ్యలో తరలివస్తున్నట్లు సభ్యులు వివరించారు. మానవతావాదులు, అమృతప్రణయ్ మద్దతుదారులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm