హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎలక్షన్ కమిషన్ (ఇసి) అఫిడవిట్ దాఖలు చేసింది. బూత్ లెవెల్ ఓటర్ల జాబితాను హైకోర్టుకు సమర్పించింది. అఫిడవిట్లో ఉన్న విధంగా ఓటర్ల జాబితా ఉండాలని హైకోర్టు పేర్కొంది. అఫిడవిట్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31న వింటామని పేర్కొంది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm