కడప: జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ సీఎం రమేష్ నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా రమేష్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm