చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. పళనిస్వామి ఇచ్చిన రోడ్డు పనుల కాంట్రాక్టులపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. హైవే కాంట్రాక్టు పనులపై డిఎంకె పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వేల కోట్ల రూపాయిల కాంట్రాక్టు పనులను తన బంధువుల, స్నేహితులకు పళనిస్వామి కట్టబెట్టారని ఆరోపించింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు పళనిస్వామి ఇచ్చిన కాంట్రాక్టులపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm