తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. ఆలయంలోకి వెళ్లే స్వేచ్ఛ మహిళలకు కూడా ఉందన్న సుప్రీం ధర్మాసనం ఆలయ ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. దీనిపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, కొందరు మహిళలు మాత్రం సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చంటూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ తాము మాత్రం 50 ఏళ్లు దాటే వరకు ఆలయానికి వెళ్లబోమని తేల్చి చెప్పారు.
నిజానికి 10-50 ఏళ్ల మహిళలు శబరిమల సందర్శనపై నిషేధం ఉంది. దీనిని సవాలు చేస్తూ కొందరు మహిళలు కోర్టుకెళ్లారు. విచారించిన కోర్టు మహిళల ఆలయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సుప్రీం తీర్పుపై మలయాళ ప్రముఖ నటుడు కొల్లాం తులసి సంచలన వ్యాఖ్యలు చేశాడు. శబరిమల సందర్శనకు వచ్చే మహిళలను అడ్డంగా నరికేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళలను రెండు భాగాలుగా తెగనరికి ఓ భాగాన్ని ఢిల్లీకి పంపి, రెండో భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్శిల్ చేయాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. తులసి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 04:38PM