సంగారెడ్డి: అసంతృప్త నేతలతో టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా తనకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నేత రాజేశ్వర్ దేశ్ పాండే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై శుక్రవారం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు. టీఆర్ఎస్లో పనిచేసిన తనకు టికెట్ వస్తుందని ఆశించానన్నారు. అయితే తనకు టికెట్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. కనీసం అభ్యర్థి విషయంలో కూడా తనను పార్టీ సంప్రదించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను ఇక పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. ఈనెల 14న బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సంగ్గారెడ్డిలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ సభలో కేంద్ర మంత్రి సదానంద గౌడ సమక్షంలో 5వేల మందితో పార్టీలో చేరతానని రాజేశ్వర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm