పాకిస్తాన్: మట్టిళ్లు గోడ కూలి 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పాకిస్థాన్లోని సుక్కుర్ జిల్లా జరిగింది. గులామ్ సర్వార్శంబాని గ్రామంలోని ఓ ఇంటి వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పిల్లలంతా 4-12 ఏండ్ల మధ్య వయసున్నవారే. గోడ కూలిన ఘటనపై విచారణ జరుపుతున్నామని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm