హైదరాబాద్: గ్రూప్-2 పై హైకోర్టు తీర్పు నిరుద్యోగులకు సంతోషం కలిగించే విషయమని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఇవాళ కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఈ తీర్పు ఓ రకంగా సంతోషాన్ని కలిగించే విషయమని తెలిపారు. తీర్పును పరిశీలించి, త్వరలో మిగతా ప్రక్రియను చేపడతామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm