హైదరాబాద్: తెలంగాణ హోం మత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోరారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.28 లక్షలుకాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు స్వయంగా నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm