విజయవాడ: విజయవాడలో జనసేన నిర్వహించనున్న కవాతు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, రాష్ట్ర కోఆర్డినేటర్ల కన్వీనర్ చింతల పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈనెల 15న జరిగే జనసేన కవాతుని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని అందులో భాగంగానే ఈ రోజున పార్టీ పోస్టర్ విడుదల చేశామని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే సర్ ఆర్ధర్ కాటన్ ధవలేశ్వరం బ్రిడ్జి వైపు చూసే విధంగా జనసేన కవాతు ఏర్పాటు చేయడం జరుగుతుందని లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm