హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆస్తులను ఎస్ బీఐ జప్పు చేసింది. మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డిలకు చెందిన ఆస్తులను ఎస్ బీఐ జప్తు చేసింది. ఎస్ బీఐ నుంచి తీసుకున్న కోటీ 78 లక్షల 54 వేల రూపాయల రుణం చెల్లించాలని ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఎస్బీఐ వారి ఆస్తులను జప్తు చేసింది. పట్నం రాజేందర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద మహేందర్ రెడ్డి కుటుంబం రుణం తీసుకుందని ఎస్ బీఐ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm