జయశంకర్ భూపాలపల్లి: జిల్లా వాజేడు మండల పరిధిలోని క్రిష్ణపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయపడ్డారు. పేరూరు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారంౌ చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బట్టిగూడెం గ్రామనికి చెందిన పాల్దేవ్ ఆనందరావు(ఆలియస్ మొండి)(38), దుబ్బగూడెం గ్రామానికి చెందిన మడె రమణయ్య అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై క్రిష్ణపురం గ్రామం నుంచి చండ్రుపట్ల వెళ్తుండగా క్రిష్ణపురం గ్రామ శివారులో అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఆనందరావు అక్కడికక్కడే మృతి చెందగా, మడే రమణయ్య తీవ్ర గాయపడ్డాడు.
క్రిష్ణపురం గ్రామస్తులు పేరూరు ఎస్సై స్వామికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తుల వివరాలు సేకరించారు. గాయపడిన రమణయ్యను పేరూరు వైద్యశాలకు తరిలించారు. అక్కడి వైద్య సిబ్బంది ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైనా వైద్యం కోసం 108 వాహనంలో వరంగల్ ఎంజిఎం వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆనందరావు మృతదేహానికి పోసుమార్ట్టం నిర్వహించి, భార్య పాల్దేవ్ దనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 08:14PM