నాగర్కర్నూలు: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ది సభ్యత, సంస్కారం లేని ప్రభుత్వం అని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ను ప్రజలు బంగాళాఖాతంలో పడేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజయశాంతి పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm