విజయవాడ: మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం నాదెండ్లను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్, నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాదెండ్ల మనోహర్ నాకు అన్నలాంటి వారు. బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ఇకపై జనసైనికుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పవన్ ఆలోచన, సామాజిక స్పృహ అంటే తనకు బాగా ఇష్టమన్నారు. కాగా గత రెండ్రోజులుగా నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్తో ఉన్నారు. ఇద్దరూ కలిసే తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm