హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమిలో ఇంకా సీట్ల పంచాయితీ తేలనేలేదు. కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సిపిఐ పార్టీలు ఎవరికి ఎన్నిసీట్లు అన్నది ఇప్పటికే పలుసార్లు కూర్చొని చర్చించినా కొలిక్కిరాలేదు. కోందండరాం అసంతృప్తిలో ఉన్నారని, త్వరగా పంచాయతీ తేల్చాలని కోరారని ప్రచారం రావడంతో ఉత్తమ్ స్పందించారు. మిత్రపక్షాల్లో మంచి వాతావరణం ఉందని.. ఏ మిత్ర పక్షానికి ఎన్ని సీట్లు అనే విషయం రేపు మాట్లాడుకుంటామని, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమికి 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి పేరు కూడా మార్చనున్నామని రెండు రోజులలో సీట్లతో పాటు పేరును కూడా ప్రకటించనున్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm