హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో హైదరాబాదులో వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో రూ. 75 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. మూడు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. షయనత్ గంజ్ ప్రాంతంలో బ్రిజేష్ తివారీ అనే వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు, పవన్ అనే వ్యక్తి నుంచి రూ. 60 లక్షలు... జూబ్లీహిల్స్ లో రాంచందర్ అనే వ్యక్తి నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన పోలీసులు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm