తిరువనంతపురం: శబరిమల ఆలయ ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చడానికి ఆరెస్సెస్ శ్రేణులు ప్రయత్నించాయని మీడియా సమావేశం ద్వారా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలియజేశామని అదేవిధంగా మహిళలు ఆలయాన్ని సందర్శించడానికి అవసరమైన ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ప్రభుత్వం కాని, పోలీసులు కాని మహిళలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఆయన చెప్పారు. ఆలయం తలుపులు తెరచుకోవడానికి ముందే అక్కడకు చేరిన ఆరెస్సెస్ శ్రేణులు మహిళలను అడ్డుకుంటూ ఆలయ ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చడానికి ప్రయత్నించాయని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm