హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఎస్సై, కానిస్టేబుల్ అవినీతి నిరోదకశాఖ అధికారులకు చిక్కారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి నుంచి మీర్చౌక్ ఎస్సై సారంగపాణి, కానిస్టేబుల్ కిరణ్కుమార్లు రూ. రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడత కింద రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, ఇవ్వజూపినా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm