కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బిజెపి చేపట్టదలచిన రథయాత్రను రెండు రోజులపాటు వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రచారం కోసం నేతలు వెళుతున్న నేపథ్యంలో రథయాత్రను వాయిదా వేశారు. బీర్భమ్లోని తారాపీఠ్నుంచి డిసెంబర్ 3న ప్రారంభం కావలసిన రథయాత్ర డిసెంబర్ 5న ప్రారంభమవుతుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాయాంతన్ బసు చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో నవంబర్ 12 ఉ డిసెంబర్ 7 మధ్య కాలంలో ఎన్నికలు జరుగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm