న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా కేసు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ మనిషి అయిన రాకేశ్ ఆస్థానా ఇప్పుడు రెడ్హ్యండెడ్గా దొరికిపోయారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాకేశ్ ఆస్థానాను మోడీ ఎంపిక చేశారు. ఆయన్ను ఉన్నత స్థానంలో నియమించి భాజపా నేతలపై ఉన్న కేసుల విచారణను జరగకుండా ఆపించాలని వారి ఉద్దేశం. ఇప్పుడు ఆయన రెడ్హ్యండెడ్గా దొరికిపోయారు అని ఏచూరి ట్వీట్ చేశారు.
ాాఆస్థానాకు ఎవరు అండగా నిలుస్తున్నారు? సీబీఐ డైరెక్టర్ నుంచి వ్యతిరేకత ఉన్నా ఆయనను ఈ సంస్థలోకి ఎవరు ఎంపిక చేసి తీసుకొచ్చారు? ఈయనే ఇప్పుడు లంచాలు తీసుకొని, నకిలీ పత్రాలు సృష్టించి దొరికిపోయాడు. విచారణలో ఇతణ్ని కష్టమైన ప్రశ్నలు కూడా వేయడం లేదు. ఇందులో ఆంతర్యం ఏమిటి? అని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఎందరో అర్హత లేని అధికారులను ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టారని విమర్శించారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థల ప్రతిష్ఠను ఎన్డీఏ ప్రభుత్వం మసకబారుస్తోందని ఆరోపించారు. మాంసం ఎగుమతిదారుడు మొయీన్ ఖురేషి కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అక్టోబరు 15న సీబీఐ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదు చేసింది. గుజరాత్ క్యాడర్కు చెందిన ఆస్థానా 2002 సమయంలో గోద్రా అల్లర్ల కేసు విచారణకు నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆయన వడోదర పరిధిలో ఐజీగా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 05:02PM