ఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ డిసెంబర్ 15లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30లోపు 12 శాతం వడ్డీ రూ.550 కోట్లను చెల్లించాలని ఇంతకు ముందు కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ డబ్బు చెల్లించక పోవడంతో మరోసారి కోర్టు గడువు పెంచింది. ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ, మరో ఇద్దరు సీనియర్ అధికారులు దేశం విడిచి పోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎరిక్సన్ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. తమకు ఉద్దేశ పూర్వకంగానే అంబాని డబ్బు చెల్లించడం లేదని ఆరోపించింది. ఆర్కామ్ ఇకపై ఆస్తులు విక్రయించేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm