మధ్య ప్రదేశ్ : తైక్వాండో కోచ్ మనోజ్ శివహరే తన వద్ద శిక్షణ తీసుకునే బాలికపై లైంగిక దాడి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూణేలో జరిగే తైక్వాండో పోటీలకు మనోజ్తో పాటే 15 ఏండ్ల తన శిష్యురాలు వెళ్లారు. ఒక హోటల్లో దిగారు. అనంతరం రాత్రి సమయంలో కోచ్ ఆ బాలిక వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోసులను ఆశ్రయించటంతో విషయం బయటకు వచ్చింది. నిందుతుడిని పోలీసులు అరెస్టు చేసారు. ఆ పోటీల్లో బాలిక విజయం సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm