భద్రాచలం: జిల్లా చర్ల మండల పరిధిలోని టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 78 కుటుంబలు భద్రాచలం సి.పి.యం అభ్యర్థి మీడియం బాబురావు సమక్షంలో సి.పి.యం లో చేరారు. వీరికి పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు మచ్చు వెంకటేశ్వరరావు, బాబురావు తదితరులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్గా మంచి పేరు ఉన్న బాబురావు గతంలో ఎంపిగా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఈ రోజు ఆయనకు ప్రచారంలో ప్రజలు నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో సీపీఐ(ఎం) అనునిత్యం ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలో ఆకర్షితులైన ప్రజలు పార్టీలో భారీగా చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm