న్యూఢిల్లీ: టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో మైలురాయికి దగ్గర్లో ఉన్నాడు. ఆదివారం విండీస్తో జరిగిన తొలి వన్డేలో అద్భుత సెంచరీ చేసి తన ఖాతాలో 36వ సెంచరీని వేసుకున్న కోహ్లీ ఇప్పుడు మరో రికార్డుకు సిద్ధమవుతున్నాడు. మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో భారత బ్యాట్స్మన్గా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కుతాడు. అంతేకాదు.. సచిన్ రికార్డు కూడా బద్దలవుతుంది. సచిన్ ఈ ఫీట్ను 259 వన్డేల్లో సాధించగా, కోహ్లీ ఇప్పటి వరకు 204 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. పదివేల పరుగులకు 81 పరుగుల దూరంలో ఉన్నాడు. బుధవారం విండీస్తో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ కనుక ఆ 81 పరుగులు చేస్తే సరికొత్త రికార్డు అతడిపేర నమోదవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm