కేరళ: మండలం-మకరవిళక్కు యాత్రలో భాగంగా అయ్యప్ప ఆలయాన్ని భారీ భద్రత మధ్య శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు తెరిచారు. స్వామియే అయ్యప్పా అంటూ భక్తుల శరణుఘోషల మధ్య ప్రధాన పూజారి కందరారు రాజీవరు గర్భగుడి తాళాలు తీశారు. వేలాది మంది భక్తులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. 41 రోజులపాటు సాగే మండలం యాత్ర డిసెంబర్ 27తో ముగుస్తుంది. అనంతరం ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేస్తారు. మకరవిళక్కు పర్వదినంలో భాగంగా డిసెంబర్ 30న ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు ఘనంగా నిర్వహిస్తారు. మకరజ్యోతి కూడా ఇదే రోజు దర్శనమిస్తుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 20న మూసివేస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm