హైదరాబాద్:కర్ణాటకలోని అనెగొండి గ్రామానికి ఫ్రాన్స్ మహిళ కూతురు పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అందులోనూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హం. ప్రాన్స్వా అలియాస్ శారద అనే ఫ్రాన్స్ దేశీయురాలు 1965లో ఫ్రాన్స్ నుంచి ఆమె కర్ణాటకలోని అనెగొండికి వచ్చి స్థిరపడ్డారు. స్థానికుడు శాంతమూర్తిని వివాహం చేసుకొని అంజనా దేవి అనే పాపకి జన్మనిచ్చారు. అయితే అంజనాదేవి నాలుగేళ్ల వయసులోనే తన తండ్రి శాంతమూర్తిని కోల్పోగా కొన్నేళ్ల కిందట తల్లి శారద కూడా కన్నుమూశారు. అలా ఒంటరి అయిన అంజనానే ఇప్పుడు సర్పంచ్ అయ్యారు. అంజనా చిన్నప్పటి నుండే సమాజం, ప్రజలు అని తపన పడుతూ ఉండడం, సోషల్ వర్క్లో బీఏ గ్రాడ్యూయేషన్ కూడా పూర్తిచేయగా అనెగొండి గ్రామంలో మంచి పేరు ఉంది. రెండో వార్డు సభ్యురాలిగా పంచాయతీ ఎన్నికలలో నెగ్గిన అంజనకు మొత్తం 11 మంది సభ్యులు మద్దతు తెలపగా ఆమె ఏకగ్రీవంగా పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm