హైదరాబాద్:పశ్చిమగోదావరి జిల్లాలో భీమడోలు మండలం పాతురు షుగర్ ప్యాక్టరీ దగ్గర శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందగా, మరో లారీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. అలాగే క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీ టైర్ మారుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm