హైదరాబాద్: అంబానీకి ఆర్థిక లబ్ది చేకూర్చటం కోసమే రాఫెల్ డీల్ విషయంలో మోడీ సర్కారు దేశ రక్షణను తాకట్టు పెట్టిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన రాఫెల్ డీల్పై ఎవరైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అనే ముద్ర వేస్తున్నారన్నారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో పీపుల్ వాంట్ టూ ట్రూత్ పేరిట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ అనిల్ అంబానీ, ఆదానీలకు ఆర్థిక లబ్ది చేకూర్చుకునేందుకు పాత రక్షణ ఒప్పందాలను ప్రధాని మోడీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఓవైపు మేకిన్ ఇండియా అంటూ రక్షణ వ్యవస్థలో పరికరాల కొనుగోలు సందర్భంగా చేసుకునే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని మోడీ సర్కారు విస్మరించిందని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm