హైదరాబాద్: ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పాతురు షుగర్ ప్యాక్టరీ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆగి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో లారీ డ్రైవర్తో పాటు క్లీనర్కు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm