హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల ముందు సోనియాను కలిసినప్పుడు పార్టీ విలీనంపై చర్చించానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్లో నాయకత్వ లోపం ఉందని.. ప్రజలు విశ్వసించడం లేదని సోనియాతో చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. ఈ విషయాన్ని దిగ్విజయ్తో మాట్లాడమని చెప్పారని.. కానీ దిగ్విజయ్ తనను అవమానించాడని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు విజయశాంతి, గడ్డం అరవింద్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తమకు అన్ని వర్గాలు సూచించాయని కేసీఆర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm