గ్వాంగ్జౌ (చైనా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ను విజయంతో మొదలు పెట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యమగూచిపై 24-22, 21-15 తేడాతో గెలుపొందింది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 18-21, 6-21 తేడాతో ప్రపంచ ఛాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడాడు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడంతో అతడు ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు అర్హత సాధించాడు. భారత్ నుంచి కిదాంబి శ్రీకాంత్ తర్వాత టోర్నీ ఆడిన రెండో షట్లర్ అతడే.
సింధు, యమగూచి పోరు హోరాహోరీగా సాగింది. మూడో సారి టోర్నీలో అడుగు పెట్టిన సింధు తొలి గేమ్ను 27 నిమిషాల్లో ముగించింది. తొలుత ఆమె 6-11 తేడాతో వెనకబడింది. స్వల్ప విరామం తీసుకున్న తర్వాత పుంజుకుంది. చెలరేగి ఆడింది. ఫోర్హ్యాండ్, బ్యాక్హ్యాండ్ షాట్లు, ప్లేస్మెంట్స్, క్రాస్కోర్టు షాట్లతో స్కోరును 19-19తో సమం చేసింది. ఒత్తిడి నెలకొన్న వేళ సింధు సంయమనం చూపింది. శరీరం, మనసు సమన్వయంతో ఉండటంతో 22-22 తర్వాత వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్లో తొలుత యమగూచి నుంచి ప్రతిఘటన ఎదురైనా 14-11, 18-11తో దూసుకుపోయింది. గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 12,2018 07:54PM