హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. సీఎం కేసీఆర్తో పాటు 17 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm