హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, మంగళవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించి, ఖరారు చేయటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm