హైదరాబాద్ : నల్గొండ జిల్లా షాబునగర్కు చెందిన తెడ్ల నాగరాజు నుంచి అప్పు తీసుకొని చెల్లని చెక్కు ఇచ్చారన్న ఆరోపణ రుజువు కావడంతో నిందితుడు సిహెచ్.వీరన్నకు ఏడాది జైలుశిక్ష, రూ.90 వేలు పరిహారం చెల్లించాలని, లేకుంటే మూడు నెలల జైలు అనుభవించాలని స్పెషల్ మెజిస్ట్రేట్ లకిëనారాయణ బుధవారం తీర్పునిచ్చారు. నాగరాజు 2016 మార్చి 9న వీరన్నకు రూ.90 వేలు ప్రామిసరీ నోటుపై అప్పు ఇచ్చారు. తిరిగి వీరన్న చెక్కు ఇవ్వగా బ్యాంకులో వేయగా చెల్లకపోవడంతో నాగరాజు కోర్టును ఆశ్రయించారు. అదే విధంగా మరో చెల్లని చెక్కు ఇచ్చారన్న ఆరోపణ రుజువు కావడంతో ఎస్. శంకర్కు ఏడాది జైలు, రూ.50 వేలు పరిహారం చెల్లించాలని, లేకుంటే మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని ఆదేశిస్తూ స్థానిక స్పెషల్ మెజిస్ట్రేట్ లకిëనారాయణ తీర్పునిచ్చారు. 2015 మే 7న బి. శంకర్ సుమారు రూ.50 వేలు ఎస్. జయలకిë నుంచి అప్పుగా తీసుకొని చెక్కు ఇవ్వగా బ్యాంకులో చెల్లకపోవడంతో కోర్టును ఆశ్రయించగా ఇరువురి వాదనలు విన్న అనంతరం శంకర్కు శిక్ష విధించింది.
Mon Jan 19, 2015 06:51 pm