హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. బుధవారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరించాలని తెలంగాణ రైతు రుణ విముక్తి కమిషన్ను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm