న్యూఢిల్లీ: కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందగా మరో ఇద్దరు మహిళలు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. రాణి ఝాన్సీ రోడ్ ఫ్లెఓవర్ సమీపంలో ఓ వైద్యుడు అతి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ అదుపుతప్పి ముగ్గురు మహిళలను ఢీకొట్టాడు. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా కొద్దిదూరంలోనే అతడిని పట్టుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా కూలీలు. ఓ ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం భారిన పడ్డారు. నిందితుడు అంబూజ్ గార్గ్(47) గంగారాం ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm