హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోని మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు ఇస్తే, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీఆర్ఎస్ ఓడిపోతుందని విచిత్రమైన సర్వేను ఇచ్చారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన అంచనాలు తప్పడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పడ్డారని ఎద్దేవా చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు మహాకూటమి నేతలు నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన భవిష్య వాణి రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Mon Jan 19, 2015 06:51 pm