హైదరాబాద్ : నటి శ్వేతా బసు ప్రసాద్, ఫిల్మ్మేకర్ రోహిత్ మిట్టల్ల వివాహం అట్టహాసంగా జరిగింది. గురువారం తెల్లవారు జామున వీరిద్దరి వివాహ వేడుక పుణెలో జరిగింది. ఈ వారంలో ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన ఫొటోలను శ్వేత ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. 'పెళ్లి అయిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చి ఫొటోలను షేర్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm